దర్వాజ-బెంగళూరు
Devotees Throw Fire At Each Other: విభిన్న మాతాలు, ఆచార సంప్రదాయాలు, సంస్కృతులకు పుట్టినిల్లైన భారత్ లో జరుపుకునే కొన్ని వేడుకలు ఆశ్చర్యంతో పాటు భయనకంగానూ ఉంటాయి. కర్నాటకలో జరుగుతున్న అలాంటి ఓ జాతర దృశ్యాలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఓ జాతర సందర్భంగా అక్కడి భక్తులు ఒకరిపై ఒకరు నిప్పుల కురిపించుకున్నారు. భగభగ మండే కాగడాలు మీదకు విసురుకున్నారు. వివరాల్లోకెళ్తే.. కర్నాటకలోని కటీల్ దుర్గా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో జాతరలో భగభగ మండే కాగడాలను భక్తులు ఒకరిపై ఒకరు విసురుకున్నారు. ఇలా భగభగ మంగే కాగడాలను ఒకరిపై ఒకరు విసురుకోవడం ఇక్కడి ఆచారమని స్థానికులు చెబుతున్నారు. ఈ ఆగ్ని క్రీడలో గాయాలైన భక్తులు వైద్యం చేయించుకోకుండా.. గాయాలపై కుంకుమ నీళ్లు జల్లుకోవడం మరో ప్రత్యేకత. చాలా కాలం నుంచి జరుతున్న ఈ జాతర వేడుకలో ఇప్పటివరకు ఎలాంటి దుర్ఘటనలు జరగలేదని చెబుతున్నారు.
కటీల్లోని శ్రీ దుర్గాపరమేశ్వరి ఆలయంలో ‘తూత్తేధార’ లేదా ‘అగ్ని ఖేళి’ అనే క్రీడను ఏప్రిల్ 22న జరుపుకున్నారు. దీనిలో భాగంగా భగభగ మండుతున్న కాగడాలు ఒకరిపై ఒకరు విసురుకున్నారు. ఇక్కడి ప్రజలు పాటిస్తున్న ఆచారంలో భాగంగానే ‘తూత్తేధార’ లేదా ‘అగ్ని ఖేళి’ అనే క్రీడను జరుపుకుంటున్నట్టు అక్కడి ప్రజలు చెబుతున్నారు. దీనిలో చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా పాలుపంచుకుంటారు. కటీల్ దుర్గా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు భక్తులు ఈ వేడుకను జరుపుకుంటారట. దుర్గాపరమేశ్వరి ఆలయంలో ‘తూత్తేధార’ లేదా ‘అగ్ని ఖేళి’ అనే క్రీడను ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో జరుపుకుంటారు. ఇక్కడ జరిగే 8 రోజుల జాతరలో రెండవ రోజున దీనిని నిర్వహిస్తారు.