దర్వాజ-అంతర్జాతీయం
Pakistan suicide blast: ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో పాకిస్తాన్ వాయువ్య ప్రాంతంలో సైనిక వాహనంపై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు సహా మరో ముగ్గురు సైనికులను చనిపోయారు. మొత్తం ఆరుగురు చినిపోగా, పలువురు గాయపడ్డారు. ఆఫ్ఘనిస్తాన్కు ఆగ్నేయంగా 26 కిలోమీటర్లు (16 మైళ్లు) దూరంలో ఉన్న ఉత్తర వజీరిస్థాన్లోని మిరాన్ షా సమీపంలోని చిన్న మార్కెట్లో శనివారం సాయంత్రం ఆత్మాహుతి బాంబర్ తనను తాను పేల్చుకున్నాడు. ఆ ప్రాంతాల్లో జనాభా అధికంగా ఉండటంతో ఈ దాదిలో ముగ్గురు చిన్నారులు, మరో ముగ్గురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారని పాకిస్తాన్ సైన్యం తెలిపింది. “భద్రతా బలగాల వాహనం అటుగా వెళ్లినప్పుడు బాంబర్ కాలినడకన వచ్చి తనను తాను పేల్చేసుకున్నాడు” అని స్థానిక ప్రభుత్వ అధికారి తెలిపారు.
అలాగే, గురువారం రాత్రి కూడా దేశ ఆర్థిక రాజధాని కరాచీలో పేలుడు సంభవించింది. నగరంలో రద్దీగా ఉండే సద్దార్ ప్రాంతంలో ఈ పేలుడు జరిగిన ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. 13 మంది తీవ్రంగా గాయపడ్డారు.