దర్వాజ-తిరుపతి
Tirumala temple: మార్చి 21, 22 తేదీల్లో తిరుమల ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తెలిపింది. మార్చి 22న ఉగాది (శ్రీ శోభకృత్ నామ సంవత్సరం) ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ తెలిపింది. పవిత్ర చైత్ర శుద్ధ పాడ్యమి రోజున తిరుమల ఆలయంలో ఉగాది ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది. 21న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఆలయ శుద్ది కార్యక్రమం చేయనున్నారు.