Tirupati: సోదరుడి భార్యతో అక్రమసంబంధం.. చివరకు..
దర్వాజ-అమరావతి
Tirupati: అక్రమ సంబంధాలు పచ్చనికాపురాల్లో చిచ్చుపెడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సోదరుడి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న తమ్ముడిని కొట్టి చంపిన ఘటన తిరుపతిలోని చిల్లకూరు మండలం కాకువారిపాలెం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామంలోని గిరిజన కాలనీకి చెందిన కిన్యాపల్లి బాలాజీ, ప్రతాప్ (25) అన్నదమ్ములు. ఇద్దరికీ వివాహమై విడివిడిగా నివసిస్తున్నారు. ప్రతాప్ భార్య 10 నెలల క్రితం డెలివరీ సమయంలో చనిపోవడంతో బాలాజీ తన తమ్ముడు ప్రతాప్కు తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చాడు.
అయితే, అప్పటి నుంచి బాలాజీ భార్యతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు ప్రతాప్. ఆదివారం రాత్రి భార్యతో ఉన్న ప్రతాప్ను చూసిన బాలాజీ ఆగ్రహంతో ప్రతాప్పై కర్రతో దాడి చేశాడు. తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో గూడూరు రూరల్ సీఐ శ్రీనివాసులురెడ్డి, ఎస్ఐ గోపాల్రావు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
Share this content: