దర్వాజ-మునుగోడు
Munugodu by-election results: మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఉప ఎన్నికలో తెలంగాణలోని నల్గొండ జిల్లాలోని ఆదివారం ఉదయం కట్టుదిట్టమైన భద్రత మధ్య ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. నల్గొండ కౌంటింగ్ హాలు వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. తెలంగాణలోని మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి రెండో స్థానంలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి డిపాజిట్ కోల్పోయారు.