Ukraine Russia War: ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ సంచలన నిర్ణయం !
దర్వాజ-అంతర్జాతీయం
Ukraine Russia War: ఉక్రెయిన్-రష్యా దేశాల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారతదేశంలోని ఉక్రెయిన్ రాయబారితో పాటు ఇతర రాయబారులను తొలగించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ శనివారం జర్మనీలోని కైవ్ రాయబారితో పాటు అనేక ఇతర అగ్ర విదేశీ రాయబారులను తొలగించినట్లు అధ్యక్ష వెబ్సైట్ తెలిపింది. అయితే, దీనికి గల కారణాలను వెల్లడించలేదు. అందులో జర్మనీ, భారతదేశం, చెక్ రిపబ్లిక్, నార్వే, హంగేరీలలో ఉక్రెయిన్ రాయబారులను తొలగించినట్లు ఆయన ప్రకటించారు. రాయబారులకు కొత్త ఉద్యోగాలు అప్పగిస్తారా లేదా అనేదానిపై స్పష్టత లేదు.
ఈ ఏడాది ఫిబ్రవరి 24న రష్యా ఉక్రెయిన్ పై సైనిక చర్యకు దిగింది. ఈ క్రమంలోనే జెలెన్స్కీ ఉక్రెయిన్కు అంతర్జాతీయ మద్దతు, సైనిక సహాయాన్ని అందించాలని కోరారు.
Share this content: