Breaking
Mon. Jun 30th, 2025

భారత్ జోడో యాత్రకు త‌క్కువ విరాళమిచ్చారంటూ దుకాణ‌దారుడిపై దాడి.. కాంగ్రెస్ కార్యకర్తలు సస్పెండ్

Congress, attack, Kerala man, Bharat Jodo Yatra, suspended, vegetable vendor, Kollam, కాంగ్రెస్, దాడి, కేరళ వ్యక్తి, భారత్ జోడో యాత్ర, సస్పెండ్, దుకాణ‌దారుడు, కొల్లాం,

దర్వాజ-తిరువనంతపురం

Bharat Jodo Yatra: కాంగ్రెస్ నాయ‌కులు రాహుల్ గాంధీ దేశ‌వ్యాప్త భార‌త్ జోడో యాత్ర‌కు త‌గినంత విరాళం ఇవ్వ‌లేద‌ని కాంగ్రెస్ కార్యక‌ర్త‌లు ఒక కూర‌గాయ‌ల దుకాణ‌దారుడిని బెదిరించారు. ఈ వీడియోలు వైర‌ల్ కావ‌డంతో కాంగ్రెస్ స‌ద‌రు దాడికి పాల్ప‌డిన కార్య‌క‌ర్త‌ల‌ను స‌స్పెండ్ చేసింది. వివరాల్లోకెల్తే.. కేరళలోని కొల్లాంలో కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు కూరగాయల దుకాణం యజమానిని బెదిరించి అతని దుకాణాన్ని ధ్వంసం చేశారు. కాంగ్రెస్ కొనసాగుతున్న భారత్ జోడో యాత్రకు పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేసిన రూ. 2,000 విరాళంగా ఇవ్వలేకపోవ‌డంతో ఈ దాడి చేసిన‌ట్టు షాప్ య‌జ‌మాని ఆరోపించాడు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో, ఈ ఘటనలో పాల్గొన్న ముగ్గురు కార్యకర్తలను సస్పెండ్ చేసినట్లు కాంగ్రెస్ ఒక ప్రకటన విడుదల చేసింది.

ఒక వీడియోలో, షాపు యజమాని ఎస్ ఫవాజ్, “భారత్ జోడో యాత్రా నిధుల సేకరణ పేరుతో, కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు నాపై దాడి చేశారు. వారు రూ.2,000 అడిగారు, కానీ నేను రూ. 500 మాత్రమే ఇవ్వగలను. ఈ క్ర‌మంలోనే వారు కూర‌గాయ‌ల‌ను ప‌డేశారు. నా దుకాణాన్ని, నా కస్టమర్లను కూడా అవమానించారు” అని దుకాణదారుడు పేర్కొన్నాడు. తన దుకాణాన్ని ధ్వంసం చేసిన ఐదుగురిలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెచ్ అనీష్ ఖాన్ కూడా ఉన్నారని ఫవాజ్ పేర్కొన్నారు. వీడియో వైరల్ కావడంతో, ఈ ఘటనలో పాల్గొన్న ముగ్గురు పార్టీ కార్యకర్తలను తక్షణమే సస్పెండ్ చేసినట్లు కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కె సుధాకరన్ తెలిపారు. “వారు మా భావజాలానికి ప్రాతినిధ్యం వహించరు.. అలాంటి ప్రవర్తన క్షమించరానిది. కార్పొరేట్ విరాళాలు పొందే ఇతరులకు భిన్నంగా పార్టీ స్వచ్ఛందంగా చిన్న విరాళాలను సమకూరుస్తోంది” అని కె సుధాకరన్ అన్నారు. సుధాకరన్ సరైన నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకులు జైరాం రమేష్ అన్నారు.

Related Post