దర్వాజ-న్యూఢిల్లీ
Weather Update: రాబోయే కొద్ది రోజుల్లో దేశంలోని పలు దక్షిణ, తూర్పు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే ఐదు రోజుల్లో దక్షిణ ద్వీపకల్ప భారతదేశం, ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్-సిక్కిం, ఈశాన్య భారతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) అంచనా వేసింది. సముద్ర మట్టం వద్ద రుతుపవనాల ద్రోణి హిమాలయాల పర్వత శిఖరాలకు దగ్గరగా కొనసాగుతోందని సమాచారం.
దేశంలోని ఈశాన్య రాష్ట్రాలు రాబోయే కొన్ని రోజుల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. రానున్న 5 రోజుల్లో నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తన బులిటెన్ లో పేర్కొంది. సెప్టెంబర్ 2-3 తేదీలలో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయలలో కూడా చాలా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దేశంలోని మధ్య-తూర్పు ప్రాంతాలు కూడా భారీ వర్షపాతాన్ని చూసే అవకాశం ఉంది. “ఆగస్టు 31-సెప్టెంబర్ 01న దక్షిణ మధ్యప్రదేశ్ లో విస్తారంగా ఉరుములు మెరుపులతో వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ఆగస్టు 31-సెప్టెంబర్ 02 వరకు బీహార్, ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కిం మీదుగా వచ్చే ఐదు రోజులు వర్షాలు కురవనున్నాయి. సెప్టెంబర్ ౩ వరకు ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్-సిక్కింలో కూడా చాలా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.
పశ్చిమ హిమాలయ ప్రాంతంలో రాబోయే మూడు రోజుల్లో చెదురుమదురుగా తేలికపాటి లేదా ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా. కాగా, సెప్టెంబర్ 4న జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనీ, రాబోయే రెండు రోజుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. కర్ణాటక, తమిళనాడు, కేరళ సహా దక్షిణాది రాష్ట్రాల్లో రాబోయే ఐదు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. “ఆగస్టు 31-సెప్టెంబర్ 01వ తేదీల్లో ఉత్తర ఇంటీరియర్ కర్ణాటకలో విస్తారంగా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. సెప్టెంబర్ 02 వరకు కోస్తా కర్ణాటక, లక్షద్వీప్, తమిళనాడు, కేరళ 3 రోజులు మోస్తారు వర్షలు కురుస్తాయని తెలిపింది.