దర్వాజ-బురుండి
new virus-Deadlier than Covid: కరోనా వైరస్ కంటే అతి భయంకరమైన మరో వైరస్ వెలుగులోకి వచ్చింది. ఈ వైరస్ సోకిన 24 గంటల్లోనే ప్రాణాలు కోల్పోతున్నారు. దీని లక్షణాలు ఒక రకమైన వైరల్ హెమరేజిక్ జ్వరాన్ని సూచిస్తున్నాయి. ఇది మార్బర్గ్, ఎబోలా వంటి చిన్న రక్త నాళాల గోడలను దెబ్బతీయడంతో.. మనుషులను అనారోగ్యానికి గురిచేస్తున్నాయని ప్రాథమికంగా వైద్య నిపుణులు గుర్తించారు.
వివరాల్లోకెళ్తే.. మరో కొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది. ఇది 24 గంటల్లోనే మనుషుల ప్రాణాలు తీస్తోందని సమాచారం. పశ్చిమ ఆఫ్రికాలోని ఈశాన్య ప్రాంతమైన బురుండిలో ముక్కు నుంచి రక్తం కారడం, వైరస్ సోకిన వ్యక్తి ని 24 గంటల్లోనే చంపేయడం వంటి గుర్తుతెలియని వ్యాధి ముగ్గురు ప్రాణాలను బలితీసుకుంది. లక్షణాలు ఒక రకమైన వైరల్ హెమరేజిక్ జ్వరాన్ని సూచిస్తాయి. అయితే, దీని గురించి ఖచ్చితమైన వివరాలు తెలియాల్సి ఉంది. దీనిపై నిర్ణయం తీసుకోవడానికి ముందు ఐఎన్ఎస్పి (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్) నుండి నిపుణులు సేకరించిన నమూనాల ఫలితాల తర్వాత వెల్లడిస్తామని అక్కడి ప్రభుత్వం పేర్కొంటోంది.
మృతులు గిటోబ్ కమ్యూనిటీకి చెందిన వారుగా తెలుస్తోంది. వీరిద్దరూ బజీరో ప్రాంతంలోని మిగ్వా కొండ సమీపంలో నివసిస్తున్నారు. నమోదైన కేసులన్నీ ఇక్కడివేనని అధికారులు వెల్లడించారు. కడుపునొప్పి, మరణం తర్వాత తీవ్రమయ్యే నాసికా రక్తస్రావం, తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరం, వాంతులు, మైకము వంటి లక్షణాలు కనిపిస్తాయని ఆన్ సైట్ పరిశీలకులు తెలిపారు. ఎస్ఓఎస్ మీడియా బురుండితో మాట్లాడిన ఒక నర్సు ఈ వ్యాధి బాధితులను చాలా వేగంగా చంపుతుందని చెప్పారు. తీవ్ర అనారోగ్యానికి గురిచేసి, వైరస్ సోకిన వ్యక్తి 24 గంటల్లోనే చనిపోతాడని తెలిపారు. ప్రస్తుతానికి ఆ ప్రాంతాల్లోని ప్రజలు భయటకు రాకుండా క్వారంటైన్ లో ఉండాలని స్థానిక వైద్యులు సూచిస్తున్నారు.