దర్వాజ-పశ్చిమగోదావరి
West Godavari: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (సోమవారం) పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో పర్యటించనున్నారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలోనే నరసాపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
సోమవారం సీఎం జగన్ మోహన్ రెడ్డి నరసాపురం పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి..
- ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.50 గంటలకు నరసాపురం చేరుకుంటారు.
- నరసాపురంలో వివిధ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని 11.15 నుంచి మధ్యాహ్నం 12.50 గంటల వరకు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.
- అనంతరం సీఎం జగన్ మోహన్ రెడ్డి అక్కడ నిర్వహించే ఒక బహిరంగ సభలో పాల్గొంటారు.
- సీఎం జగన్ మధ్యాహ్నం 1.15 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2.00 గంటలకు తాడేపల్లికి చేరుకుంటారు.
- ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తాగునీటి ఎద్దడికి శాశ్వత పరిష్కారం.. ₹1,400 కోట్లతో సమగ్ర రక్షిత మంచినీటి పథకం, సీఎం వైయస్ జగన్ చేతుల మీదుగా నవంబర్ 21న పనులకు శంకుస్థాపన. ₹10,131 కోట్లతో 9 ఉమ్మడి జిల్లాల్లో వాటర్ గ్రిడ్ అమలు అంశాలు ఉన్నాయని సంబంధిత నాయకులు తెలిపారు.
- అలాగే, నరసాపురంలో సీఎం వైయస్ జగన్ చేతుల మీదుగా 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించనున్నారని సమాచారం.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తాగునీటి ఎద్దడికి శాశ్వత పరిష్కారం.. ₹1,400 కోట్లతో సమగ్ర రక్షిత మంచినీటి పథకం, సీఎం వైయస్ జగన్ చేతుల మీదుగా నవంబర్ 21న పనులకు శంకుస్థాపన. ₹10,131 కోట్లతో 9 ఉమ్మడి జిల్లాల్లో వాటర్ గ్రిడ్ అమలు.#CMYSJagan #AndhraPradesh #APDC pic.twitter.com/M6tXhnKHBU
— AP Digital Corporation (@apdigitalcorp) November 20, 2022