దర్వాజ- సిద్దిపేట్
Nangnoor-siddipet: నంగునూర్ మండలం సిద్దన్నపేట గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాల్లో తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సోమవారం గ్రామంలో తల్లిపాలపై అవగాహన ర్యాలీ తీశారు. అనంతరం గర్బణీ స్త్రీలకు సామూహిక సీమంత కార్యక్రమాన్ని నిర్వహించారు. తరువాత చిన్న పిల్లలకు బాలామృతం తినిపించడం, అంగన్వాడీ పిల్లలకు సామూహిక అక్షరాభ్యాసం, తల్లులు, బాలింతలు పోషకాహారం అందించడం వంటి పలు కార్యక్రమాలను నిర్వహించారు. గర్భిణులు, బాలింతలకు తల్లి పాలపై అవగాహన కల్పించారు. తల్లి పాలు శిశువుకు ఆరోగ్యప్రదాయినీ అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బెదురు తిరుపతి మాట్లాడుతూ.. తల్లి పాలె బిడ్డకు శ్రీరామ రక్ష అని, పుట్టిన బిడ్డకు గంటలోపు తల్లిపాలు బిడ్డకు పట్టిస్తే.. అది మొదటి టీకాతో సమానం అవుతుందని అన్నారు. పిల్లలకుముర్రుపాలు అందించడం వల్ల వారిలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. పిల్లలకు ఆరు నెలల వరకు తల్లిపాలు అందించడం ఎంతో శ్రేయస్కరమని అన్నారు. గర్భీణీ, బాలింతల కోసం కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం గ్రామ సర్పంచ్ డాకురి కనకవ్వ మాట్లాడుతూ.. తల్లి పాలును మించిన ఆహారం మరొకటి లేదన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈకార్యక్రమంలో గ్రామ సర్పంచ్ డాకురి కనకవ్వ, ఎంపీటీసీ బెదురు తిరుపతి, ఉపసర్పంచ్ బెదురు లచ్చవ్వ, వార్డ్ సభ్యులు కనకవ్వ, ఏఎన్ఎం సరస్వతి, హెల్త్ సూపర్వైజర్ వెంకటరమణ, హెల్త్ అసిటెంట్ భాస్కరభట్ల, తెరాస నాయకులు భాస్కర్ రెడ్డి, అంగన్వాడీ టీచర్లు కత్తుల భవాని, కచగొని లావణ్య, ఆశావర్కర్లు మమత, చంద్రకళ, ఆయాలు లక్ష్మీ, లచ్చవ్వ, బాలింతలు తదితరులు పాల్గొన్నారు.
తల్లిపాల వారోత్సవాల ప్రాముఖ్యత
స్త్రీకి మాతృత్వం వరం. ఏ మహిళ ఆ వరాన్ని పొందాలని, ఒకరిద్దరు పిల్లలకు జన్మనివ్వాలని కోరుకుంటుంది. అయితే.. కొంతమంది స్త్రీలు అందం, శరీర ఆకృతి పోతుందని పిల్లలను కనడం మానేస్తున్నారు. మరికొందరూ ఇతర పద్దతుల్లో పిల్లలను జన్మనిస్తున్నారు. తీరా పిల్లలకు జన్మనిచ్చినా.. వారికి తల్లి పాలు ఇవ్వడం లేదు. ఇలా చేయడం వల్ల పిల్లల ఆరోగ్యంతో పాటు రోగనిరోధక శక్తి దెబ్బతినే ప్రమాదముందని వైద్య నిపుణులు, ప్రపంచ ఆరోగ్య సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఈ పద్దతి ఎంత మాత్రమూ సరికాదని అంటున్నాయి. ఈ నేపథ్యంలో తల్లిపాలపై అవగాహన కల్పించడానికి డబ్ల్యూహెచ్వో తల్లి పాలే ముద్దు-డబ్బా పాలు వద్దు అనే నినాదంతో ఆగస్టు 1 నుండి 7వ తేదీ వరకు ప్రపంచ వ్యాప్తంగా తల్లిపాల వారోత్సవాన్ని జరుపుతోంది. తల్లిపాల ప్రాముఖ్యత, దాని ఆవశ్యకత గురించి పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది.