• ప్రపంచంలోని మొత్తం కేసుల్లో 71 శాతం భారత్లోనే..
• బ్లక్ ఫంగస్ వ్యాప్తికి కారణాలు ఇవే: తాజా రిపోర్టు
దర్వాజ-న్యూఢిల్లీ
black fungus cases: కరోనా మహమ్మారి వెగులు చూసిన తర్వాత రికార్డు స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ఫంగస్ కేసులు సైతం నమోదవుతున్నాయి. మరీ ముఖ్యంగా భారత్లో అయితే ఈ వ్యాధి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ప్రపంచంలోని బ్లాక్ ఫంగస్ కేసుల్లో 71 శాతం భారత్లోనే ఉన్నాయంటే దీని వ్యాప్తికి అద్దం పడుతోంది. వైద్య పరిభాషలో మ్యూకోర్ మైసిస్గా పిలువబడే బ్లాక్ ఫంగస్.. భారత్లో ఇంత ఆందోళనకర స్థాయిలో వ్యాపిస్తుండగానికి గల కారణాలపై అధ్యయనం చేసిన పరిశోధకులు పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
ఛండీగఢ్కు చెందిన పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (పీజీఐఎంఈఆర్), జర్మనీకి చెందిన లైబ్నిజ్ ఇనిస్టిట్యూట్ ఫర్ ట్రోపోస్పెరిక్ రీసెర్చ్ పరిశోధకు అధ్యయనం ప్రకారం.. దేశంలో బ్లాక్ ఫంగస్ కేసులు అధికంగా నమోదుకావడానికి డయాబెటిస్, అధిక స్టెరాయిడ్స్ వాడకం, అపరిశుభ్ర పరిస్థితులు, ఐరన్ మెటబాలిజంలో మార్పులు, నివాస, ఆస్పత్రి ప్రాంతాల్లో సరైన వెలుతురు లేకపోవడం వంటివి ప్రధాన కారణాలుగా ఉన్నాయని పేర్కొంది. దీంతో మ్యూకోర్ మైసిస్ విజృంభణ కొనసాగి వైద్య సంక్షోభానికి కారణం అయిందని తెలిపింది.
2021 మే నాటికి భారత్లో దాదాపు 14,872 బ్లాక్ ఫంగస్ కేసులు ఉన్నాయి. వీటిలో అధికంగా మహారాష్ట్ర, గుజరాత్ యాక్టివ్ కేసులు, రికవరీలు నమోదవుతున్నాయి. ఈ పరిశోధనకు కోవిడ్ సంబంధిత బ్లాక్ ఫంగస్ డేటాను భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) సైతం అందించిందని పరిశోధకులు వెల్లడించారు.
బ్లాక్ ఫంగస్ కేసులకు పెరగడానికి కారణాలివి..
భారత్లో బ్లాక్ఫంగస్ కేసులు అధికంగా పెరగడానికి గల కారణాల్లో మొదటిది మధుమేహం. ఈ అధ్యయనం ప్రకారం 50 శాతానికి పైగా బ్లాక్ఫంగస్ కేసుల్లో మధుమేహం ఉంది. 2019లో బ్లాక్ ఫంగస్పై జరిపిన అధ్యయనంలో 57 శాతం మంది రోగులకు అనియంత్రిత మధుమేహం ఉందని పరిశోధకులు గుర్తించారు.
అలాగే, ఆక్సిజన్పై ఉన్న కరోనా రోగులకు స్టెరాయిడ్స్ ఇవ్వడం వల్ల మరణ రేటు తగ్గిందన్న క్లినికల్ ట్రయల్స్ నేపథ్యంలో కోవిడ్ సెకండ్వేవ్లో స్టెరాయిడ్స్ వాడకం రికార్డు స్థాయిలో పెరిగింది. అవసరంలేని వారికి సైతం స్టెరాయిడ్స్ భారీ మోతాదులో ఇవ్వబడ్డాయని అధ్యయనం గుర్తించింది. ఇది బ్లాక్ఫంగస్ కేసులు పెరగడానికి దారితీసిందని వెల్లడిరచింది.
కరోనా సెకండ్వేవ్ సమయంలో ఆస్పత్రుల్లో పడకలు అందుబాటులో లేకపోవడంతో చాలా మంది కరోనా రోగులు, సాధారణ రోగులు ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ఆక్సిజన్ వాడేప్పుడు ఆక్సిజన్ సిలిండర్లకు స్వేదజలాన్ని తేమ వనరుగా ఉపయోగించాలి. ఇది సరియైనదిగా లేకపోతే బ్యాక్టీరియా వంటి ఫంగస్ వ్యాధికారక జీవుల అభివృద్ధికి దారి తీస్తుంది. ఈ కారణం కూడా బ్లాక్ఫంగస్ కేసులు పెరగడానికి దారి తీసింది.
బ్లాక్ ఫంగస్ వ్యాప్తికి మరో ప్రధాన కారణం సరైన వెలుతురు లేకపోవడ. దేశంలోని చాలా ఆస్పత్రులు, గృహాలు సరైన వెంటిలేటర్ లేని కారణంగా బ్లాక్ ఫంగస్ వ్యాప్తి జరుగుతున్నట్టు ఈ అధ్యయనం గుర్తించింది. పలు ఆస్పత్రుల్లో నెలల పాటు వెంటిలేటర్పై ఉన్న వారిలోనూ బ్లాక్ ఫంగస్ వ్యాప్తి అధికంగా ఉన్నట్టు గుర్తించామని ఈ అధ్యయనం పేర్కొంది.
రైతులపైకి దూసుకెళ్లింది మా కారే.. : కేంద్ర మంత్రి అజయ్ మిశ్ర
బొగ్గు సంక్షోభంతో కరెంట్ కష్టాలు..
నిలిచిపోయిన ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్..
అఫ్ఘాన్లో బాంబు దాడి.. 14 మంది మృతి
రైతులపైకి దూసుకెళ్లిన కేంద్రమంత్రి కాన్వాయ్.. 8 మంది మృతి
లింగ వివక్ష.. పితృస్వామ్యం.. మధ్యలో మహిళ !
పెరిగిన పెట్రోల్ ధరలు.. సెంచరీ కొట్టిన డీజిల్
లాల్ బహదూర్ శాస్త్రి మరణం వెనుక కారణాలు..
యూపీలో మరో దారుణం.. బాలికపై లైంగిక దాడి.. హత్య !