దర్వాజ-న్యూఢిల్లీ
Bipin Rawat: మొట్టమొదటి భారత త్రివిధ దళాధిపతి (చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్) జనరల్ బిపిన్ రావత్ (Bipin Rawat) ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదవశాత్తూ కొయంబత్తూర్ సమీపంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో బిపిన్ రావత్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో ఆయనతో పాటు ఆయన సతీమణి మధులికతో సహా మొత్తం 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో చిత్తూరు చెందిన ఓ జవాను కూడా ఉన్నారు. ఈ ఘనకు సంబంధించిన వివరాలు వాయుసేన అధికారికంగా వెల్లడించింది. 1978 డిసెంబర్లో ఆర్మీలో తన ప్రయాణాన్ని మొదలు పెట్టిన బిపిన్ రావత్.. దేశ మొట్టమొదటి త్రివిధ దళాల అధిపతి (CDS) గానూ సేవలందించారు. ఆయన మృతి పట్ల దేశ ప్రముఖులందరూ సంతాపం ప్రకటించారు.
ఏవరీ బిపిన్ రావత్?
ఈయన పూర్తి పేరు జనరల్ బిపిన్ లక్ష్మణ్ సింగ్ రావత్. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పూరీలోని హిందూ గర్వాలీ రాజ్పుత్ కుటుంబంలో మార్చ్ 16, 1958లో జన్మించారు. తన ప్రథమిక విద్యను డెహ్రడూన్ లోని కాంబ్రియన్ హాల్ స్కూల్ లో ప్రారంభించారు. ఆ తర్వాత సిమ్లాలోని సెయింట్ ఎడ్వర్డ్ స్కూల్ లో చదివారు. ఆ తర్వాత ఖడక్వాస్లాలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ లో చేరారు. అటునుంచి డెహ్రడూన్ లోని ఇండియన్ మిలటరీ అకాడమీలోకి ప్రవేశించారు. అక్కడ బిపిన్ ప్రతిభకు ‘స్వోర్డ్ అఫ్ ఆనర్’ లభించింది. డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ (DSSC)-వెల్లింగ్టన్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. హయ్యర్ కమాండ్ కోర్సును యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ కమాండ్ అండ్ జనరల్ స్టాఫ్ కాలేజ్-ఫోర్ట్ లీవెన్ వర్త్ , కాన్సాస్ లో పూర్తి చేశారు. అలాగే మద్రాస్ యూనివర్సీటి లో డిఫెన్స్ స్టడీస్లో ఎంఫిల్ డిగ్రీ, మేనేజ్మెంట్ అండ్ కంప్యూటర్ స్టడీస్లో డిప్లొమాలను పూర్తి చేశారు. అలాగే, సైనిక మీడియా వ్యూహాత్మక అధ్యయనాల మీద పరిశోధనలకు గానూ మీరట్ లోని చరణ్ సింగ్ విశ్వవిద్యాలయం ఫిలాసఫీలో డాక్టరేట్ అందించింది.

Bipin Rawat 1978 డిసెంబర్ 16న గూర్ఖా రైఫిల్స్లోని 5వ బెటాలియన్లో చేరి తన ఆర్మీ జీవితాన్ని ప్రారంభించారు. ఆయన యుద్ధ నైపుణ్యాలను గమనించిన ఇండియన్ ఆర్మీ పలు కీలక ఆపరేషన్లలో ఆయన సేవలను ఉపయోగించుకుంది. దేశ వ్యతిరేక, తిరుగుబాటు కార్యకలాపాల నిరోధక ఆపరేషన్లలో పదేండ్ల పాటు సేవలందించారు. జమ్మూకాశ్మీర్ ఆర్మీ విభాగంలో పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. సరిహద్దు వెంట Southern కమాండర్ గా III Corps 19th Infantry Division MONUSCO North Kivu కు నాయయత్వం వహించారు. బ్రిగేడియర్ పదోన్నది పొందిన తర్వాత Rashtriya Rifles, Sector 5, 5/11 Gorkha Riflesకు నాయకత్వం వహంచారు. బ్రిగేడియర్ హోదాకు పదోన్నతి పొందిన ఆయన సోపోర్ లో 5 సెక్టార్ ఆఫ్ రాష్ట్రీయ రైఫిల్స్ కు నాయకత్వం వహించాడు. ఆ తర్వాత డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో (మోనుస్కో)లో జరిగిన చాప్టర్ 62 మిషన్ లో బహుళజాతి బ్రిగేడ్ కు నాయకత్వం వహించగా, అక్కడ ఆయనకు రెండుసార్లు ఫోర్స్ కమాండర్ ప్రశంసా పత్రం లభించింది.
మేజర్ జనరల్ గా పదోన్నతి అనంతరం రావత్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ 19వ పదాతి దళ విభాగం (ఉరి)గా బాధ్యతలు స్వీకరించారు. ఇండియన్ మిలటరీ అకాడమీ (డెహ్రాడూన్)లో ప్రత్యేక పదవిలో సేవలు అందించారు. మిలటరీ ఆపరేషన్స్ డైరెక్టరేట్ లో జనరల్ స్టాఫ్ ఆఫీసర్ గ్రేడ్ 2, మధ్య భారతదేశంలోని రీ ఆర్గనైజ్డ్ ఆర్మీ ప్లెయిన్స్ ఇన్ ఫాంట్రీ డివిజన్ (రాపిడ్) లాజిస్టిక్స్ స్టాఫ్ ఆఫీసర్, మిలటరీ సెక్రటరీ బ్రాంచ్ లో కల్నల్ మిలటరీ సెక్రటరీ మరియు డిప్యూటీ మిలటరీ సెక్రటరీ, జూనియర్ కమాండ్ వింగ్ లో సీనియర్ ఇన్ స్ట్రక్టర్ వంటి బాధ్యతలను ఆయన నిర్వర్తించారు.
భారత తొలి త్రివిధ దళాధిపతిగా..
బిపిన్ రావత్ 2017 జనవరి 1 నుంచి గత ఏడాది డిసెంబర్ 31 వరకు ఆర్మీ చీఫ్గా బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్)గా జనరల్ బిపిన్ రావత్ 2019లో నియమితులయ్యారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ సర్వీసెస్ త్రివిధ దళాలకు సంబంధించి రక్షణ శాఖ మంత్రికి ప్రధాన సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. ట్రైనింగ్, ఆపరేషన్స్, సహకార సేవలు, కమ్యూనికేషన్స్, రిపేర్, మెయింటెనెన్స్ అనే పలు రకాల వాటిలో త్రివిధ దళాలను సమన్వయం చేసుకుంటూ భారత రక్షణ వ్యవస్థను పటిష్టం చేయడానికి త్రివిధ దళాధిపతిగా Bipin Rawat కృషి చేస్తున్నారు.
Also Read:
AFSPA రద్దు చేయండి.. ఈశాన్య భారతంలో నిరసనలు
కెవ్వు కేక అనిపిస్తున్న జాన్వీ కపూర్ అందాలు
ఈటల రాజేందర్ భూకబ్జా నిజమే: మెదక్ కలెక్టర్
బీజేపీలో చేరేందుకు సిద్దమైన తీర్మాన్ మల్లన్న.. ఎప్పుడంటే?
అందరికి ఉన్నవే నాకు ఉన్నయ్.. హాట్ ఫోటో షూట్ పై పాయల్ ఘాటు సమాధానం..
భార్యను చంపనీకే ఏకంగా క్షుద్రపూజలే చేసాడు.. ఆఖరికి ఏమైందంటే..?
బాబోయ్.. ప్రియాంక అంత రెమ్యూనరేషన్ తీసుకుందా..
పెళ్లంటే సులువు కాదురా.. అంటున్న పూజా హెగ్డే