సీఎం కేసీఆర్ కు కరోనా పాజిటివ్
- ఎర్రవల్లి ఫామ్ హౌజ్ లో ఐసోలేషన్
- నిజమేనని తేల్చిన తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్
దర్వాజ-హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ కు కరోనా సోకింది. కరోనాకు సంబంధించిన స్వల్ప లక్షణాలు ఉన్నట్లు కొన్ని రోజుల ముందు గుర్తించారు. దాంతో కొన్ని రోజులుగా సిద్దిపేటలో ఉన్న ఎర్రవల్లి ఫామ్హౌస్లో ఐసోలేషన్లో ఉన్నారు.
ఈ విషయం నిజమేనని తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు. ప్రసుతం సీఎం ఫామ్ హౌస్ లో విశ్రాంతి తీసుకుంటున్నారని తెలిపారు.కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు డాక్టర్ల బృందం పర్యవేక్షిస్తుందని పేర్కొన్నారు. అయితే కరోనా కు సంబంధించిన మైల్డ్ సింటమ్స్ మాత్రమే ఉన్నాయని ఎవరూ ఆందోళన పడాల్సిన పనిలేదని సీఎస్ తెలిపారు.
కొన్ని రోజుల ముందు సీఎం కేసీఆర్ నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న విషయం తెలిసిందే. టీఆర్ఎస్ అభ్యర్ధి నోముల భగత్కు మద్దతుగా ఏర్పాటు చేసిస హాలియా ఎన్నికల సభలో సీఎం పాల్గొన్నారు. టీఆర్ ఎస్ అభ్యర్థి అయిన నోముల భగత్కు కూడా కరోనా పాటిటివ్ అని తేలింది.
Share this content: