Breaking
Sun. Jun 29th, 2025

e-Shram: అసంఘటిత కార్మికుల్లో 20% రిజిస్ట్రేషన్‌

unorganised workers_ e-Shram portal
unorganised workers_ e-Shram portal

• ఒడిశా, బెంగాల్‌లో అత్యధికం..
• ఈ-శ్రామ్‌ పోర్టల్‌లో ఇప్పటివరకు 7.7 కోట్లకు పైగా రిజిస్ట్రేషన్‌లు

న్యూఢల్లీ-ద‌ర్వాజ‌

unorganised workers_ e-Shram portal : దేశంలో కరోనా లాక్‌డౌన్‌ దుర్భల పరిస్థితుల నేపథ్యంలో అసంఘటిత కార్మికులు గుర్తింపు కోసం ఆధార్‌తో అనుసంధానించ‌బడిన రిజిస్ట్రేషన్‌ డేటాబెస్‌ ‘ఈ-శ్రామ్‌’ పోర్టల్‌ను కేంద్ర ప్రభుత్వం తీసుకువ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఇందులో ఇప్పటివరకు మొత్తం 7.7 కోట్లకు పైగా రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. అసంఘటిత కార్మికుల్లో దాదాపు 20 శాతం రిజిస్ట్రేషన్ ల‌క్ష్యం పూర్త‌యిన‌ట్టు నివేదికలు పేర్కొంటున్నాయి. అసంఘటిత కార్మికుల‌ రిజిస్ట్రేషన్‌ లక్ష్యాన్ని చేరుకోవడంలో ఒడిశా, బెంగాల్‌, ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, బీహార్‌లు ముందున్నాయి.

లక్ష్యంగా పెట్టుకున్న‌ 38.37 కోట్ల అసంఘటిత కార్మికుల రిజిస్ట్రేషన్‌లో ఒడిశా 87 శాతం కవరేజీతో మొదటిస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానంలో ఉన్న బెంగాల్‌లో 65 శాతం, ఛత్తీస్‌గఢ్‌లో 33శాతం, బీహార్‌లో 25 శాతం కవరేజీతో ఉన్నాయి. ఈ-శ్రామ్‌ పోర్టల్‌లో నమోదు చేసుకున్న తర్వాత యూనివర్సల్‌ ఖాతా నెంబర్‌తో ఈ`శ్రామ్‌ కార్డు వస్తుంది. దీనికి దేశంలో ఎక్కడైనా గుర్తింపు ఉంటుంది. దీనిని వివిధ సామాజిక భద్రతా పథకాలతో లింక్‌ చేయడానికి ఉపయోగించుకోవచ్చు. అలాగే, ప్రమాద బీమా లభిస్తుంది.

ఈ-శ్రామ్ పోర్ట‌ల్‌లో రిజిస్టిర్‌ చేసుకున్న కార్మికుడు ప్రమాదానికి గురై శాశ్వత వైకల్యం లేదా మరణానికి గురైతే రూ.2 లక్షల బీమా అందుతుంది. అలాగే, పాక్షిక వైకల్యానికి గురైతే రూ.1లక్ష సాయం అందుతుంది. సంబంధిత మంత్రిత్వ శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి మాట్లాడుతూ.. ‘ప్రభుత్వం 38.37 కోట్ల అసంఘటిత కార్మికల రిజిస్ట్రేషన్‌ను లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలి. గత వారంలో రోజువారీ సగటు రిజిస్ట్రేషన్‌లు దాదాపు 12 లక్షలుగా ఉన్నాయి’ అఁని అన్నారు. నవంబర్‌ 15 నాటికి 7.73 కోట్ల రిజిస్ట్రేషన్‌లు పూర్తయ్యాయని తెలిపారు.

తొందరగా అలిసిపోయి, నీరసంగా అనిపిస్తోందా.! అయితే మీకు ఈ సమస్య ఉన్నట్టే..

Dengue: ఢిల్లీలో డెంగ్యూ పంజా

చలికాలమని నీళ్లు తాగకుండా ఉంటున్నారా?.. అయితే మీ పని అంతే..

T20 World Cup: నయా ఛాంపియన్ ఆస్ట్రేలియా

బట్టతల ఉందని బాధపడుతున్నారా.. ? అయితే మీకో గుడ్ న్యూస్..

పిల్లలపై 400 శాతం పెరిగిన సైబర్‌ నేరాలు

‘కాప్26లో పాల్గొన‌క‌పోవ‌డానికి ప్ర‌భుత్వ యంత్రాంగ‌మే కార‌ణం’

ఆవు పేడ, మూత్రంతో ఆర్థిక వ్యవస్థ బలోపేతం: సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్

Related Post