దర్వాజ-హైదరాబాద్
Gold Price Today: పసిడి ధరలు ఏ టైంలో తగ్గుతాయో.. ఏ టైంలో పెరుగుతాయో ఎవరూ చెప్పలేరేమో.. ఇకపోతే గడిచిన రెండు రోజులు స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఈ రోజు ఒక్కసారిగా పెరిగాయి. అదికూడా 10 శాతం పెరిగింది. ఇదిలా ఉంటే వెండి ధర మాత్రం అలాగే స్థిరంగా కొనసాగుతోంది. ఇకపోతే ప్రస్తుతం పసిడి ధర హైదరాబాద్ లో 22 క్యారెట్ల పై 10 శాతం పెరిగి రూ. 45,110 గా తులం ధర కొనసాగుతోంది.
అంటే ఒక గ్రామ్ బంగారం ధర 4,511 రూపాయలుగా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర తులం రూ. 49,210 గా కొనసాగుతోంది. దేశంలో వివిధ పట్టణాల్లో 22 క్యారెట్ల బంగారం ధరలు ఏవిధంగా ఉన్నాయంటే.. కోల్కతాలో రూ.47,510, న్యూఢిల్లీలలో రూ. 47, 260, ముంబయిలో రూ.46,220, బెంగుళూరులో రూ. 45,110, చెన్నైలో రూ.45,420 ఉండగా కేరళలో రూ.45,110 పదిగా పసిడి ధర పలుకుతోంది.
ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధరలు ఈ విధంగా కొనసాగుతున్నాయి.. న్యూఢిల్లీలో రూ.51,560, కోల్ కతాలో రూ. 50,210, చెన్నైలో రూ.49,550, బెంగుళూరులో రూ.49,210 గా ఉండగా కేరళలో 49,210 రూపాయుగా ఉంది. పసిడి ధరలు ఈ విధంగా ఉంటే ప్రస్తుతం హైదరాబాద్ లో కిలో వెండి ధర 68,700 రూపాయలుగా కొనసాగుతోంది.
27 శాతం పెరిగిన వ్యాపారుల ఆత్మహత్యలు
తమిళనాడులో దంచి కొడుతున్న వానలు
కండ్లు పీకేస్తాం.. చెయ్యి నరికేస్తాం.. : బీజేపీ ఎంపీ
స్నానం ఏ సమయంలో చేస్తే మంచిది?
దుమ్ములేపుతున్న ‘లాలా భీమ్లా నాయక్’ పవర్ ఫుల్ సాంగ్ !
Sierra Leone: ఘోర ప్రమాదం.. 92 మంది మృతి
Fire Accident: కరోనా ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. 11 మంది మృతి
Climate Change: ప్రకృతి విధ్వంసం.. ప్రకోపం..