అబ్బే.. ఓటు వేయడం రాకపోవడమేంటి బేషుగ్గా వచ్చు అంటారా ఏంటి ? నిజమే.. మీరు పట్టభద్రులు కావొచ్చు. కానీ మీలో చాలా మందికి ఓటు ఎలా వేయాలో తెలియదు. దీంతో నేటికీ ఎన్నో ఓట్లు ఫెయిల్ అవుతునే ఉన్నాయి. అలా కాకుండా ఉండాలంటే మీకు తెలిసినా కానీ.. ఒకసారి మేము చెప్పే విషయాలతో మీకు తెలిసిన విషయాలను పోల్చి చూసుకోండి. దాంతో తెలియకపోతే తెలిసిపోతుంది. తెలిసుంటే.. ఇంకొంచెం ఎక్కువ సమాచారం తెలుస్తుంది.

ఇక ఈ ఎమ్మెల్సీ ఓట్లు మాములుగా ఎమ్మెల్యే, ఎంపీ ఓట్ల మాదిరిగా ఈవీఎం మెషన్ల ద్వారా వేయరని తెలిసిందే. అలాగని సర్పంచ్ ఓట్లంత ఈజీగా ఉండదు. దీనికి కొన్ని నియమనిబంధనలు ఉన్నాయి. అవి పాటించకపోతే.. మీరు ఎంతో కష్ట పడి పట్నం నుంచి పల్లెకు పోయి ఓటు వేసినా కూడా ఫలితం దక్కదు. అలా కాకుండా ఉండాలంటే ఈ కింది విషయాలను మర్చిపోవద్దు.
ఓటు వేసే ప్రక్రియ ఎట్లుంటుంది?
ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఓటును ప్రాధాన్యత రూపంలో(ప్రిఫరెన్సియల్ ఆర్డర్) వేయాల్సి ఉంటుంది. ఇందులో ఒకరికంటే ఎక్కువ క్యాండెట్లకు ఓటు వేసే అవకాశం ఉంటుంది. అంటే మనకు బాగా నచ్చిన వ్యక్తిని ముందు, ఆ తర్వాత కొంచి తక్కువ నచ్చిన వ్యక్తిని.. ఆ తర్వాత ఇంకొంచెం తక్కువ నచ్చిన వ్యక్తిని ఒక ఆర్డర్ లో పెట్టడం లాంటిది.
ఎలా వేయాలి?
మీరు ముందుగా పోలింగ్ బూత్ లోకి పోగానే అక్కడ మీకు బ్యాలెట్ పేపర్, పెన్ను ఇస్తారు. అందులో మనకు నచ్చిన క్యాండెట్ల పేర్లు.. వాటి ముందు ప్రాధాన్యత ఇవ్వాల్సి బాక్స్ ఉంటుంది. అందులో మోస్ట్ ప్రిఫరబుల్ పర్సన్ కు 1 నెంబర్ ను ప్రాధాన్యత ఇవ్వాల్సిన బాక్స్ లో వేయాలి. ఆ తర్వాత ప్రిఫరెన్స్ ఇచ్చే వ్యక్తికి 2 నెంబర్ ఇవ్వాలి. ఆ తర్వాత నచ్చిన వ్యక్తికి 3 నెంబర్ ఇవ్వాలి. ఇలా ఎంత మంది ఉన్నారో అంత మందికి ప్రిపరెన్స్ బెసెస్ మీద నెంబర్లు ఇవ్వొచ్చు.

చేయకుడని పనులు
-ప్రిపరెన్సియల్ బేసిస్ కదా.. అని మీకు నచ్చినట్లు ఒకటి, రెండు అని అక్షరాల్లో రాయడం అసలే చేయొద్దు. అలా చేస్తే.. మీ ఓటు ఫెయిల్ అవుతుంది.
-ఒకరికంటే ఎక్కువ మందికి సేమ్(ఒకే రకమైన) నెంబర్ ను ఇవ్వొద్దు. అలా చేసినా కూడా ఓటు ఫెయిల్ అవుతుంది.
-మొదటి ప్రియారిటీ(1 నెంబర్) ఇవ్వకుండా మిగతా నెంబర్లు సరిగ్గానే ఇచ్చినా కూడా మీ ఓటు ఫెయిల్ అవుతుంది.
-బ్యాలెట్ పేపర్ మీద ఏ రకమైన అక్షరాలు కానీ, పేర్లు కానీ, సంతకాలు కానీ చేయొద్దు. అలా చేసినా మీ ఓటు గయా..
-నిర్ధేశించిన ఘడి( డబ్బ)లో కాకుండా కిందకు, మీదకు నెంబర్ ను వేయొద్దు. అలా చేస్తే కూడా ఓటు ఫెయిల్ అవుతుంది.
-మీరు తీసుకుపోయిన పెన్ను, పెన్సిల్స్ తో ఓట్ల ప్రియార్టీని ఇవ్వొద్దు.


చేయాల్సిన పనులు
-ప్రిఫరెన్సియల్ ఆర్డర్ లో నెంబర్లను ఇవ్వాలి
-నచ్చిన వ్యక్తికి మొదటి ప్రియారిటీ(1 నెంబర్) తప్పక ఇవ్వాలి. మిగతా ప్రియారిటీ మీ ఇష్టం.
-మొదటి ప్రియారిటీ ఇచ్చిన తరువాత 2 నెంబర్ ను తరువాత నచ్చిన వ్యక్తికి ఇవ్వాలి. ఆ తర్వాత వ్యక్తికి 3 నెంబర్ ఇవ్వాలి.
-1 నెంబర్ ఇచ్చిన తర్వాత 3 నెంబర్ ను ఇస్తే.. మీ ఓటును కేవలం 1 నెంబర్ నే పరిగనలోకి తీసుకుంటారు.
-సిరిస్ కంప్లీట్ గా ఉన్నంత వరకు మీ ప్రియార్టీస్ ను తీసుకుంటారని గమనించాలి.
-మీరు ఎలాంటి పెన్ను, పెన్సిల్స్ ను తీసుకుపోవద్దు.

పోలింగ్ బూత్ కు తీసుకుపోవాల్సివి
-మీ ఓటు స్లిప్ తో పాటుగా ఒక ఒరిజిన్ ఐడీ( భారత ప్రభుత్వం ఇచ్చినది) తీసుకుపోవాలి.
ఆందోళన చెందాల్సిన అవసరం లేనిది
-మీకు ఓటు వచ్చి ఉండి ఓటరు స్లిప్ ఇవ్వకపోతే.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ పోలింగ్ బూత్ లో ఎన్నికల అధికారులు మీకు సాయం చేస్తారు.
మర్చిపోకూడనిది
-నిర్ణిత సమయంలోగా పోలింగ్ బూత్ లో ఉండేలా చూసుకోవాలి.
-ఒక ఒరిజినల్ ఐడీ ఫ్రూప్ క్యారీ చేయాలి.
అంతే ఇక మీరు బేషుగ్గా.. ఓటు వేయడానికి పోవచ్చు. ఈ సమాచారం తెలియని వారికి తెలియజేయొచ్చు.
మగువకు మరణ సంకెళ్లు.. తొలగేదెప్పుడు ?
అవును వాళ్లు ‘గే’నే.. నీకు ఎందుకంత నొప్పి?
ద్వాదశ జ్యోతిర్లింగాలు.. వాటి విశిష్టత!