హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్
దర్వాజ-హైదరాబాద్
Gellu Srinivas Yadav : హుజూరాబాద్ ఉప ఎన్నిక టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఆ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును ఖరారైంది. ఈ మేరకు రాష్ట్ర సీఎం కేసీఆర్ తాజాగా ప్రకటించారు. నెల 16న హుజూరాబాద్లో నిర్వహించే బహిరంగ సభలో గెల్లు శ్రీనివాస్ యాదవ్ను నియోజకవర్గ ప్రజలకు స్వయంగా సీఎం కేసీఆర్ పరిచయం చేయనున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాగా, ప్రస్తుతం గెల్లు శ్రీనివాస్ యాదవ్ టీఆర్ ఎస్వీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు.
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం హిమ్మత్ నగర్ లో జన్మించిన గెల్లు శ్రీనివాస్ యాదవ్.. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ, ఎల్ఎల్బీ పూర్తి చేశారు. ఇదే యూనివర్సిటీలో రాజనీతి శాస్త్రంలో పీహెచ్డీ చేస్తున్నారు. 2017 నుండి టీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
Share this content: