Breaking
Sat. Jun 28th, 2025

లాక్‌డౌనా లేక నైట్ కర్ఫ్యూనా.. 48 గంటల్లో తేల్చుకోండి!

telangana lockdown or curfew
telangana lockdown or curfew
  • 22న స్టేట‌స్ రిపోర్ట్ ఇవ్వాల్సిందే..
  • తెలంగాణ స‌ర్కార్ కు హైకోర్ట్ ఆదేశం

ద‌ర్వాజ‌-హైద‌రాబాద్
దేశ‌వ్యాప్తంగా కరోనా విజృంభ‌న వేగంగా జ‌రుగుతోంది. ఈ మ‌హ‌మ్మారి దాటికి జనాలు పెద్ద ఎత్తున పిట్ట‌ల్లా రాలుతున్నారు. ఈ వైర‌స్ ప్ర‌భావం ఎలా ఉందో తెలియాలంటే మ‌హారాష్ట్ర‌, ఢిల్లీ రాష్ట్రాల‌ను చూస్తే తెలుస్తుంది. ఈ క్ర‌మంలో తెలంగాణ హైకోర్టు అప్ర‌మ‌త్త‌మైంది. దీనిపై రాష్ట్ర స‌ర్కార్ ను ప్ర‌శ్నించింది. తెలంగాణ స‌ర్కార్ చేప‌డుతున్న చ‌ర్య‌లను తెలుసుకుని, అసంతృప్తిని వ్య‌క్తం చేసింది.

48గంట‌ల్లో ఏదో ఒక‌టి చేయాల్సిందే..

రాష్ట్రంలో నెల‌కొన్న ప‌రిస్థితి దృష్యా.. ప్రభుత్వం కర్ఫ్యూ పెడుతుందా లేక వీకెండ్‌ లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకుంటుందా అనేదానిపై 48 గంటల్లో నిర్ణయం తీసుకోవాలని, లేకుంటే తామే ఆదేశాలు జారీ చేయాల్సి వస్తుందని హైకోర్టు హెచ్చ‌రించింది. స‌ర్కార్ దాఖాలు చేసిన నివేదిక‌లపై హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది

డీజీపీ, రాష్ట్ర ఆరోగ్యశాఖ కోర్టుకు సమర్పించిన నివేదిక‌ల‌న్ని.. తప్పుల తడకగా ఉందని హైకోర్టు అస‌హ‌నం వ్యక్తం చేసింది. రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై ఈ నెల 22వతేదీన స్టటస్‌ రిపోర్టు సమర్సించాలని సూచించింది. తదుపరి విచారణ 23న జరుగుతుందని స్పష్టం చేసింది.

క్వారంటైన్ కేంద్రాల‌ను పెంచాలి

ఎప్ప‌టిక‌ప్పుడూ.. రాష్ట్రంలో చేస్తున్న‌ కరోనా టెస్టులు. పాజిటివ్ వచ్చిన వివరాలు ప్రభుత్వ వెబ్‌ సైట్‌లో నమోదు చేయాలని హైకోర్టు ఆదేశించింది. అలాగే .. రాష్ట్రంలో క్వారంటైన్ కేంద్రాల‌ను పెంచాల‌ని, అలాగే.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారికి సరిహద్దు ప్రాంతాల్లో నిర్ధారణ పరీక్షలు చేయడం లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

వైర‌స్ నివార‌ణ చ‌ర్య‌ల‌ను ప‌టిష్టం చేయాలె

పెళ్లిళ్లు, శుభకార్యాలలో, పబ్లిక్ ప్లేస్ లలో పటిష్టమైన కరోనా నివారణ చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఆర్‌టీ పీసీఆర్‌ టెస్టులు చేసి 24 గంటల్లోనే పేషెంట్లకు రిపోర్టు ఇవ్వాలని అడ్యొకేట్‌ జనరల్‌ను ఆదేశించింది. పేషెంట్ల సందేహాలను నివృత్తి చేయడానికి, ప్రభుత్వంతో సమన్వయం కోసం ఆసుపత్రుల్లో నోడల్‌ అధికారులను నియమించాలని స్పష్టం చేసింది.

హైద‌రాబాద్ పై స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టాలె

రాష్ట్ర రాజ‌ధాని హైదరాబాద్ లో క‌రోనా కేసుల పెరుగుతుండ‌టంతో ప్ర‌త్యేక దృష్టి పెట్టాల‌ని హైకోర్టు సూచించింది. వార్డుల వారీగా కరోనా కేసుల వివరాలను అందించాలని పేర్కొంది. ఇప్పటిదాకా ప్రభుత్వం తీసుకున్న చర్యలపై పూర్తి రిపోర్టు త్వ‌రగా ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.

Related Post