◘ మహారాష్ట్రలో మరో ఘోరం
◘ నిందితుల్లో పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
దర్వాజ-ముంబయి
దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోతున్నది. నిత్యం వారిపై ఏదోఒక చోటు అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఓ 15 ఏండ్ల బాలికపై 30 మంది పలుమార్లు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. తాజాగా ఈ విషయం వెలుగులోకి రావడంతో అందరిని దిగ్భ్రాంతికి గురిచేయడంతో పాటు దేశంలో మహిళల రక్షణపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది.
పోలీసులు వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని థానే జిల్లాలోని దొంబివ్లి పట్టణానికి చెందిన 15 ఏండ్ల బాలికను స్థానికంగా ఉన్న ఓ యువకుడు ప్రేమ పేరుతో లొంగదీసుకున్నాడు. ఈ క్రమంలోనే ఈ ఏడాది జనవరిలో వారిద్దరూ శారీరకంగా కలిశారు. దీనిని ఆ యువకుడు తన మొబైల్లో చిత్రీకరించి బాధితురాలిని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. ఈ వీడియోను అడ్డుపెట్టుకుని ఆ బాలికపై అనేక రకాలు హింసకు గురిచేశాడు. తన స్నేహితులతోనూ సన్నిహితంగా ఉండాలనీ, లేకుండా వీడియోను బయటపెడుతానంటూ బెదిరించాడు. అయితే, స్నేహితులతో ఆ వీడియోను పంచుకోవడంతో బాలికకు వేధింపులు ప్రారంభమయ్యాయని సమాచారం.
ఈ నేపథ్యంలోనే ఆ బాలికపై 30 మందికి పైగా పలుమార్లు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ హింసను ఇక భరించలేని బాలిక తాజాగా పోలీసులను ఆశ్రయించింది. దీనిపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు 33 మంది నిందితుల్లో 24 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారు. నిందితుల్లో పలువురు రాజకీయ పార్టీలతో సంబంధం కలిగివున్నవారు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు.
ప్రస్తుతం ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రజాగ్రహానికి గురైన ఈ కేసు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. వివిధ పార్టీల నాయకులు సైతం ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు.
మేఘాల్లో విహరిస్తున్న బుట్టబొమ్మ.. ఎందుకంటే?
డిప్రెషన్ ను తగ్గించే చిట్కాలివిగో..
సైదాబాద్ ఘటన రాజు మరణంపై అనుమానలొద్దు: డీజీపీ మహేందర్ రెడ్డి