అదో దండకారణ్యం..
ఆ అరణ్యం మధ్యలో ఒక గిరిజన గూడెం
కనీసం వంద ఇళ్లు కూడా లేని ఆ గూడెం రెండేళ్లకు ఒకసారి కోట్లాది మందితో కిక్కిరిపోతుంది. భక్త పారవశ్యంతో తరించిపోతుంది. వందలుగా షురువై.. కోట్లాది మంది గుమ్మి కూడేలా చేసిన ఈ జాతరకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. తెలంగాణ కుంభమేళాగా పిలువబడే ఆ జాతరే.. మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర.
ఇది మన జాతర.. మన వారసత్వాన్ని గుర్తుచేసే గిరిజన జాతర. రెండెళ్లకు ఒకసారి జరిగే ఈ సంబురాలను చూసేందుకు దేశ నలుమూల నుంచి జనం తరలివస్తారు. అయితే 2020లో మహా జాతర జరిగింది. ఈ యేడు మినీ జాతర జరుగుతుంది. వచ్చే యేడు మళ్లీ మహా జాతర జరుగుతుంది. అయితే.. ఈ యేడు జరిగే మినీ జాతరకు కూడా లక్షల్లో జనం వస్తారని అంచన. ఈ జాతర ఫిబ్రవరి 24 నుంచి 27 వరకు జరగనుంది.
జాతర సమయంలో సమ్మక్క, సారలమ్మలకు ప్రత్యేక పూజలు చేయనున్నట్లు ఆలయ పూజారులు తెలిపారు. అయితే పూజారుల సంప్రదాయం ప్రకారం మినీ జాతర మండమేలిగే పండగ సందర్భంగా అమ్మవార్ల గద్దెపైకి రారు. ఈ విషయాన్ని సమ్మక్క ప్రధాన పూజారి సిద్దబోయిన అరుణ్ మీడియాతో వెళ్లడించారు.

ఇక పూజా వివరాల్లోకి వస్తే..
ఫిబ్రవరి 24: గుడిశుద్ధి, పూజాకార్యక్రమాలు, ఈ రోజు ఉదయమే గ్రామ నిర్భంధన ఉంటుంది.
ఫిబ్రవరి 25: సమ్మక్క, సారలమ్మ లకు పసుపు, కుంకుమ లతో అర్చన చేస్తారు.
ఫిబ్రవరి 26: భక్తులు అమ్మవార్లను దర్శించుకోవచ్చు.
ఫిబ్రవరి 27: అమ్మవార్లకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం మినీ జాతర ముగుస్తుంది.
మేడారం జాతరకు ప్రత్యేకంగా తెలంగాణ స్టేట్ ఆర్టీసీ ప్రతీ యేడు ఐదు వేల ప్రత్యేక బస్సులను నడిపిస్తుంది. కానీ ఈ ఏడాది జరిగే మినీ జాతరకు ఆ వెసులుబాటు ఇవ్వకపోవచ్చు. దానికి కారణం ప్రపంచాన్నిఅతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి పూర్తిగా తగ్గకపోవడమే. ఒక వేళ జాతరకు పోయేందుకు అనుమతులు ఇచ్చినా కానీ కోవిడ్-19 నిబంధనలు మాత్రం అందరూ పాటించాలి.
కడుపునొప్పి, విరోచనాలు అయితే వెంటనే జాగ్రత్త పడాల్సిందే..!