Breaking
Sat. Jun 28th, 2025

పెరుగుతున్న నేరాలు

NCRB report
NCRB report

కేసుల నమోదులో 28 శాతం పెరుగుదల
గుజారత్, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో అత్యధిక చార్జిషీట్ రేటు నమోదు
11.8 శాతం పెరిగిన సైబర్ నేరాలు
షెడ్యూల్డ్ కులాలపై 9 శాతం పెరిగిన నేరాలు

దర్వాజ-న్యూఢిల్లీ
NCRB report: దేశంలో రోజురోజుకూ నేరాలు పెరుగుతూనే ఉన్నాయి. 2019తో పోలిస్తే 2020లో కేసుల నమోదులో 28 శాతం పెరుగుదల నమోదైందని తాజాగా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదిక పేర్కొంది. కేంద్ర, రాష్ట్ర చట్టాల ఉల్లంఘణకు సంబంధించిన కేసుల నమోదు సైతం ఏకంగా 21 రేట్లు అధికమైందని ఈ నివేదిక తెలిపింది. మొత్తం 66,01,285 గుర్తించదగిన నేరాల్లో 23.46 లక్షలకు పైగా కేసులు ప్రత్యేక స్థానిక చట్టాల కింద నమోదయ్యాయి. 2019తో (51,56,158)తో పోలిస్తే.. 14,45,127 (28 శాతం) పెరుగుదల ఉంది.

లక్ష జనాభాకు నమోదైన నేరాల రేటు 201లో 385.5 నుంచి 2020లో 487.8కి పెరిగింది. 2020లో ఐపీసీ సెక్షన్ కింద నేరాల నమోదు 31.9 శాతం పెరిగింది. అలాగే, ఎస్ఎస్ఎల్ కింద నేరాలు సైతం గతేడాదితో పోలిస్తే 21.6 శాతం పెరిగినట్టు ఎన్సీఆర్బీ నివేదిక పేర్కొంది. 2020లో 55.84 లక్షలకు పైగా కేసులు విచారణలో ఉన్నాయి. వాటిలో 34.47 లక్షలకు పైగా పరిష్కరించబడ్డాయి. దాదాపు 26.12 లక్షల కేసులలో చార్జిషీట్లు నమోదుచేయబడ్డయి. ఫలితంగా చార్జిషీట్ రేటింగ్ 75.8తో 2019తో పోలిస్తే 12.50 శాతం పెరిగింది.

దేశంలో అన్ని రకాల నేరాలు కలిపి 2020లో 66,01,285 నమోదుకాగా, ఐపీసీ నేరాల కింద అధిక చార్జిషీట్ రేటును నివేదించిన రాష్ట్రాల్లో టాప్ లో గుజరాత్ ఉండగా, తర్వాతి స్థానాల్లో కేరళ, తమిళనాడులు ఉన్నాయి. ఇక 2019తో పోలిస్తే సైబర్ నేరాలు 2020లో 11.8 శాతం పెరిగాయని ఎన్సీఆర్బీ నివేదిక పేర్కొంది.

ఇక షెడ్యూల్డ్ తెగలపై 8,272 కేసులు నమోదయ్యాయి. 2019తో పోలిస్తే 9.3 శాతం పెరుగుదల నమోదైంది. 27.2 శాతం సాధారణ కేసులు, లైంగికదాడి కేసులు 13.7 శాతం, మహిళలపై దాడులకు సంబంధించిన కేసులు 10.7 శాతం నమోదయ్యాయి. మొత్తం రాజద్రోహం కేసులు 73 నమోదుకాగా, ఇందులో మణిపూర్ లో 15, అసోంలో 12, కర్నాటకలో 8, ఉత్తరప్రదేశ్ లో 7, హర్యానాలో 6, ఢిల్లీలో ఐదు, జమ్మూకాశ్మీర్ లో రెండు కేసులు నమోదయ్యాయి.

మహిళలపై నేరాల్లో ఉత్తరప్రదేశ్ టాప్

దేశంలో మహిళలపై నమోదైన నేరాల్లో ఉత్తరప్రదేశ్ టాప్ లో ఉంది. ఇక్కడ మొత్తం 49,385 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానంలో బెంగాల్ (36,439), రాజస్థాన్ (34,535)లు ఉన్నాయి. అయితే, మహిళలపై రాజస్థాన్ లో 16 శాతం నేరాలు తగ్గాయని ఎన్సీఆర్బీ నివేదిక పేర్కొంది. ఇక లైంగికదాడి కేసుల్లో రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలు మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. 2020లో రాజస్థాన్ లో అత్యధికంగా 5,310, యూపీలో 2,769, మధ్యప్రదేశ్ లో 2,339, మహారాష్ట్రలో 2,061 లైంగికదాడి కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో 4,031 మంది మహిళలు ఉండగా, 1,279 మంది 18 ఏండ్లలోపు వారు ఉన్నారు.

మీడియాపై మంచు మ‌నోజ్ ఫైర్

తెలుగు రాష్ట్రాల్లో గలీజు రాజకీయాలు

గుంటూరులో విద్యార్థిని దారుణ హత్య

ఆప్ఘానిస్థాన్ లో తాలిబన్ల రాక్షస పాలన.. షరియా చట్టం

Related Post