Breaking
Sat. Jun 28th, 2025

ఖైదీలు 4.7లక్షలు .. టీకాలు 22 వేల మందికే !

prisoners vaccinated
prisoners vaccinated

ద‌ర్వాజ‌-న్యూఢల్లీ

దేశంలోని వివిధ జైళ్లలో దాదాపు 4.7 లక్షల మంది ఖైదీలు ఉండగా, వారిలో కేవలం 22 వేల మందికి మాత్రమే కరోనా టీకాలు అందాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవియా ఖైదీలకు టీకాలు వేసిన వివరాలను పార్లమెంట్‌లో వెల్లడిరచారు. ఇప్పటివరకు (ఆగస్టు 4) మొత్తం 37 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 22,345 మంది ఖైదీలకు మాత్రమే పూర్తి కరోనా టీకాలు వేయడ్డాయి. ఈ ఏడాది డిసెంబర్‌ చివరి నాటికి ఖైదీలందరికీ టీకాలు అందిస్తామని మంత్రి తెలిపారు.

కాగా, 2019లో నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్సీఆర్బీ) విడుదల చేసిన ప్రిజన్‌ స్టాటిస్టిక్స్‌ ఆఫ్‌ ఇండియా నివేదిక ప్రకారం 2019 డిసెంబర్‌ 31 నాటికి దేశంలోని వివిధ జైళ్లలో మొత్తం 4,78,600 మంది ఖైదీలు నిర్బంధంలో ఉన్నారు. అయితే, గత రెండేండ్లలో జైలు నిర్బంధంలోకి వెళ్లిన వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని పలు సర్వేలు పేర్కొంటున్నాయి.

దుమ్ము రేపిన భారత హాకీ జట్టు

ఖైదీల‌కు ఇవ్వబడిన మొత్తం 1,87,453 కరోనా మోతాదుల్లో కేవలం 1,65,108 మంది ఖైదీలు మాత్రమే వారి మొదటి కరోనా డోసును అందుకున్నారు. 15 రాష్ట్రాలు, యూటీలలో పూర్తి డోసులు అందుకున్న ఖైదీలు ఒక్కరు కూడా లేరు. వాటిలో అండమాన్ నికోబార్‌ దీవులు, ఆంధ్రప్రదేశ్‌, చండీగఢ్‌, దాద్రా నాగర్‌ హవేలీ, డామన్‌ డయ్యూ, ఢల్లీ, గోవా, హిమాచల్‌ప్రదేశ్‌, లడఖ్‌, లక్షద్వీప్‌, మణిపూర్‌, మేఘాలయ, నాగాలాండ్‌, పుదుచ్చేరి, త్రిపురలున్నాయి. కాగా, రెండు డోసులు తీసుకున్న ఖైదీలు అధికంగా మధ్యప్రదేశ్‌లో (2,826) ఉండగా, తర్వాతి స్థానంలో ఉత్తరప్రదేశ్‌ (2,789), రాజస్థాన్‌ (2,368), గుజరాత్‌ (2,237)లున్నాయి.

మొదటి డోస్ ఒక్క‌టే అందుకున్న ఖైదీల‌ విషయంలో ఉత్తరప్రదేశ్‌ (24,230), మహారాష్ట్ర (21,868), బీహార్‌ (17,626) టాప్‌`3లో ఉన్నాయి. ఇక కరోనా తీవ్ర స్థాయిలో విజృంభించిన నేపథ్యంలో పలు జైళ్లలోని ఖైదీలను బెయిల్‌పై విడుదల చేయాలని సుప్రీంకోర్టు సైతం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. టీకాల విషయంలో హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ విఫలమైందనే ఆరోపణలతో పాటు పలు సర్వేలు ఇదే విషయాన్ని ప్రస్తావించాయి.

Related Post