Loading Now
Selfie craze nirmal

ప్రాణాలు తీసిన సెల్ఫీ

ద‌ర్వాజ‌-నిర్మ‌ల్

సెల్పీ స‌ర‌దా ముగ్గురు బాలిక‌ల ప్రాణాల‌ను బ‌లిగొంది. సెల్పీలు తీసుకునే క్ర‌మంలో చెరువులో ప‌డిపోయి ముగ్గురు బాలిక‌లు ప్రాణాలు కోల్పోయిన విషాద‌క‌ర ఘ‌ట‌న నిర్మ‌ల్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. సింగ‌న్‌గావ్‌కు చెందిన ఎల్మే దాదారావు, మంగళాబాయిలకు ఒక కుమారుడితో పాటు ఇద్దరు కుమార్తెలు స్మిత(16), వైశాలి(14) ఉన్నారు. ఆదివారం నాడు బంధువుల అమ్మాయి అంజలి (14)తో కలిసి స్మిత, వైశాలిలు వ్య‌వ‌సాయ పొలం ద‌గ్గ‌ర‌కు వెళ్లారు. కొద్ది స‌మ‌యం అక్క‌డే గ‌డిపి… మ‌ళ్లీ ఇంటికి బ‌య‌లుదేరారు. ఈ క్ర‌మంలోనే మార్గ‌మ‌ధ్య‌లో ఉన్న చెరువు ద‌గ్గ‌ర‌కు వెళ్లి సెల్పీలు తీసుకునేందుకు ప్ర‌య‌త్నించారు.

అయితే, ప్ర‌మాద‌వ‌శాత్తు చెరువులో జారిప‌డ్డారు. ఆ స‌మ‌యంలో అక్క‌డ ఎవ‌రూ లేక‌పోవ‌డంతో వారిని కాపాడ‌లేక‌పోయారని పోలీసులు తెలిపారు. వారి కుటుంబ సభ్యులు స‌మీప ప్రాంతాల్లో వెతికిన క‌నిపించ‌క‌పోవ‌డంతో పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. అయితే, సోమ‌వారం ఉద‌యం చెరువుగ‌ట్టు ద‌గ్గ‌ర చెప్పుల‌ను గ‌మ‌నించిన స్థానికులు.. పోలీసుల‌కు స‌మాచారం అందించారు. గ‌జ ఈత‌గాళ్ల‌తో మృత దేహాల‌ను బ‌య‌ట‌కు తీశారు. కేసు న‌మోదుచేసుకున్న పోలీసులు ఇత‌ర అంశాల‌పై కూడా ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని వెల్ల‌డించారు.

Share this content:

You May Have Missed