- బ్యాలెట్ బాక్సులు సీల్ లేకుండా ఎందుకున్నాయి?
- రాబోయే ఎమ్మెల్సీ ఫలితాలు ముందుగా వారనుకున్నట్టే రాబోతున్నాయా?
దర్వాజ-హైదరాబాద్
తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడింది మొదలు రాష్ట్రంలో సాధారణ అసెంబ్లీ ఎన్నికలను వేడిని తలపించింది. ముఖ్యంగా బరిలో నిలిచిన అభ్యర్థులు నువ్వా నేనా అనే మాదిరిగా ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో ప్రధాన పార్టీలు ఎలాగైనా స్థానాలను నిలబెట్టుకోవాలని పట్టభద్రులతో విస్తృత ప్రచార సమావేశాలు నిర్వహించాయి.
అయితే, ఇటీవలే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. పట్టభద్రుల భారీగానే ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో 67.26 శాతం పోలింగ్ నమోదు కాగా, వరంగల్ – ఖమ్మం – నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో 76.41 శాతం పోలింగ్ నమోదు అయింది. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే, ఇప్పుడు అందరిని ఆలోచింప చేస్తున్న విషయం.. ఎమ్మెల్సీ పోలింగ్ లో గోల్ మాల్ జరిగిందా? అసలు సీల్ వేసి ఉండాల్సిన బ్యాలెట్ బాక్సులు సీల్ లేకుండా ఎందుకు ఉన్నాయి? ఎన్నికల పోలింగ్ ముందే ఫలితాలు నిర్ణయించబడ్డాయా? అనే అనుమానాలను పలు పార్టీల నేతలు, ఏజెంట్లు వ్యక్తం చేస్తున్నారు.

ఇలాంటి అనుమానాలు వారు వ్యక్తం చేయడానికి కారణం లేకపోలేదు. బుధవారం సాయంత్రం నుంచి నల్లగొండలో బ్యాలెట్ పత్రాలను బండిల్స్ కట్టారు. ఇది పూర్తయిన వెంటనే మొదటి రౌండ్ కౌంటింగ్ ను ప్రారంభించారు. వరంగల్ – ఖమ్మం – నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో 8 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం ఓటింగ్ కౌంటింగ్ కు 8 హళ్లు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ స్థానానికి ఓ పోలింగ్ బూత్ లో ఒక ఓటు, మరో పోలింగ్ బూత్ లో 8 ఓట్లు ఎక్కువగా వచ్చినట్టు సమాచారం.
అలాగే, నల్లగొండ కౌటింగ్ హాల్ లో బ్యాలెట్ పత్రాలు భద్రపరిచిన ఆరు బాక్సులకు తాళాలు లేవని ఏజెంట్లు ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే, ఇల్లందు నియోజకవర్గంలోని ఓ పోలింగ్ బూత్ లో నమోదైన ఓట్ల కన్నా 31 ఓట్లు అధికంగా ఉన్నాయని కాంగ్రెస్ ఏజెంట్లు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దాదాపు 30 మంది వరకు ఏజెంట్లు నిరసనకు దిగారు. ఈ విషయంలో బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు కూడా చేశారు.

ఈ గందరగోళం మధ్యే టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ సహా పలువురు కౌంటింగ్ కేంద్రాల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతూ ఎన్నికల ప్రధాన అధికారికి వినతి పత్రం అందించారు. ఎదేమైనప్పటికీ.. ఇలాంటి పలు అంశాలు చోటుచేసుకోవడం ఎన్నికల సరళిపై, ఫలితాలపై ప్రభావం చూపుతున్నాయి. కాగా, ఈ పట్టభద్రలు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు గురువారం సాయంత్రం వరకు వెలువడే అవకాశముందని అధికారులు పేర్కొంటున్నారు.
ఎంపీ అరవింద్ కు కేంద్రంతో కొట్లాడే దమ్ముందా?
మరణ ముప్పు పురుషుల్లోనే అధికం !
ద్వాదశ జ్యోతిర్లింగాలు.. వాటి విశిష్టత!