Breaking
Sat. Jun 28th, 2025

Team india: భారత జట్టు ఓటమిపై షమీ కామెంట్స్ వైరల్

Mohammed Shami urges Indian bowlers to support Bumrah ind vs eng
Mohammed Shami urges Indian bowlers to support Bumrah ind vs eng

హైదరాబాద్-దర్వాజ

Team india: ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో భారత్‌కు ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది. టాప్-ఆర్డర్ బ్యాటర్లు ఫామ్‌లో కనిపించినప్పటికీ, లోయర్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. బౌలింగ్ విభాగంలో జట్టంతా జస్ప్రీత్ బుమ్రాపైనే ఆధారపడింది. తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా ఐదు వికెట్లు తీయగా, రెండో ఇన్నింగ్స్‌లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు.

మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ లాంటి బౌలర్లు స్థిరత లేకపోవడంతో భారత్ ఓటమికి దారితీసింది. షార్దూల్ ఠాకూర్‌ను పూర్తిగా నమ్మకపోవడమే కాక, ఫీల్డింగ్ కూడా చెత్తగా ఉండుంది. ఈ నేపథ్యంలో టెస్ట్ జట్టులో చోటు కోల్పోయిన పేసర్ మొహమ్మద్ షమీ తన యూట్యూబ్ ఛానెల్‌లో స్పందించారు.

బుమ్రాకు మద్దదు ఇవ్వండి : షమీ

“బౌలింగ్‌లో ఇతర భారత బౌలర్లు బుమ్రాతో మాట్లాడాలి, అతని నుండి నేర్చుకోవాలి. ప్లానింగ్‌పై చర్చించాలి, బుమ్రాకు మద్దతుగా ఉండాలి. అలా చేస్తే మ్యాచ్ గెలవడం సులభం అవుతుంది. మొదటి మ్యాచ్ విషయంలో మాట్లాడితే, బౌలింగ్‌లో మరింత కృషి చేయాల్సిన అవసరం ఉంది” అని షమీ వ్యాఖ్యానించారు.

“రెండో ఇన్నింగ్స్‌లో షార్దూల్, ప్రసిద్ధ్ తలో రెండు వికెట్లు తీసినా, అప్పటికే మ్యాచ్ భారత్ చేతిని దాటింది. కొత్త బంతితో వికెట్లు తీయడం చాలా అవసరం. బుమ్రాను మద్దతుగా నిలబడాల్సిన అవసరం ఉంది. మనం ఎక్కువ సులభమైన పరుగులు ఇచ్చినందువల్లే ఇంగ్లాండ్ మొదటి టెస్ట్ గెలిచింది. బౌలింగ్ బలంగా ఉండాలంటే సరైన మార్గాన్ని కనుగొనాలి,” అని షమీ చెప్పారు.

ఇడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో బుమ్రా ఆడటం లేదా?

ఈ టెస్ట్ సిరీస్‌లో బుమ్రాను మూడు మ్యాచ్‌లకంటే ఎక్కువ ఆడించవద్దని నిర్ణయం తీసుకున్నారు. దీంతో భారత టీమ్ మేనేజ్‌మెంట్, రెండో టెస్ట్‌లో అతనికి విశ్రాంతినిచ్చే యోచనలో ఉంది. లార్డ్స్ టెస్ట్‌కు సిద్ధంగా ఉంచే ఉద్దేశంతో ఇది జరుగుతోంది. అయితే మొదటి మ్యాచ్ ఓటమి అనంతరం శుభ్ మన్ గిల్ నేతృత్వంలోని జట్టు ఈ వ్యూహాన్ని కొనసాగిస్తుందా లేదా అనేది చూడాల్సి ఉంది.

Related Post