Breaking
Tue. Nov 18th, 2025

Gautam Gambhir: రిస్క్ ఉంటేనే లాభం ఎక్కువుంటుంది బాసు !

Darvaaja – Hyderabad

Team India: ఐదు టీ20ల సిరీస్ లో ఇంగ్లాండ్ ను 4-1 తేడాతో ఓడించిన భారత్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఐదో, చివరి టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 247 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 54 బంతుల్లో 135 పరుగులు చేశాడు. టీ20ల్లో భారత్ కు ఇది నాలుగో అత్యధిక స్కోరు కావడం విశేషం. 248 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 97 పరుగులకే ఆలౌటైంది.

మ్యాచ్ అనంతరం టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ ‘ఇలాంటి టీ20 క్రికెట్ ఆడాలనుకుంటున్నాం. మ్యాచ్లో ఓడిపోతామనే భయం మాకు లేదు. హైరిస్క్, హై రివార్డ్ క్రికెట్ ఆడాలనుకుంటున్నాం. రిస్క్ ఎక్కువుంటేనే లాభం ఎక్కువ వుంటుందని’ తెలిపారు.

RRCricBook-1876857759708189108-01 Gautam Gambhir: రిస్క్ ఉంటేనే లాభం ఎక్కువుంటుంది బాసు !

టీ20 క్రికెట్ అంటేనే అలా ఉంటుంది !

అలాగే, ‘టీ20 జట్టులోని ఆటగాళ్లు ఆ భావజాలాన్ని బాగా స్వీకరించారు. 250-260 పరుగులు చేయాలని అనుకుంటున్నాం. అలా ప్రయత్నించినప్పుడు 120 నుంచి 130 పరుగులకే ఔటయ్యే మ్యాచ్లు కూడా ఉంటాయి. అది టీ20 క్రికెట్ ఫార్మాట్’ అని గంభీర్ చెప్పారు.

‘మీరు అధిక రిస్క్ తో ఆడకపోతే, మీరు పెద్ద రివార్డులను పొందలేరు. మేము సరైన మార్గంలో ఉన్నామని నేను అనుకుంటున్నాను. భారీ టోర్నమెంట్లలో కూడా ఇదే విధంగా ఆడాలనుకుంటున్నాం. ఆటలో ఓడిపోతాననే భయం నాకు లేదు. భారత టీ20 జట్టు భావజాలం నిస్వార్థం, నిర్భయతపై ఆధారపడి ఉంది. గత ఆరు నెలలుగా ఈ జట్టులోని ఆటగాళ్లు రోజంతా ఇదే పని చేశారని’ గంభీర్ వెల్లడించాడు.

BCCI-1886062751367229618-03-1024x682 Gautam Gambhir: రిస్క్ ఉంటేనే లాభం ఎక్కువుంటుంది బాసు !

అభిషేక్ శర్మ షేక్ చేశాడు

ఇంగ్లాండ్ తో జరిగిన చివరి టీ20 మ్యాచ్ లో అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్ తో 7 ఫోర్లు, 13 సిక్సర్లు కొట్టి 135 పరుగులు సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు. దీని గురించి గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ.. ‘అభిషేక్ శర్మ వంటి ఆటగాళ్లకు అండగా నిలవాలనుకుంటున్నాం. ఈ సైనికుల పట్ల మనం ఓపికగా ఉండాలి. 140-150 కిలోమీటర్ల వేగంతో నిలకడగా బౌలింగ్ చేసే బౌలర్లపై ఇంతకంటే మెరుగైన టీ20 సెంచరీని నేను చూడలేదు. అలాగే, ఐపీఎల్ నుంచి అంతర్జాతీయ టీ20 క్రికెట్ కు వరుణ్ చక్రవర్తి అలవాటు పడిన తీరు అద్భుతం. ఇంగ్లాండ్ టాప్ క్లాస్ జట్టు కాబట్టి ఈ సిరీస్ బహుశా వరుణ్ చక్రవర్తి బెంచ్ మార్క్ కావచ్చు’ అని చెప్పాడు.

Related Post